Monday, April 29, 2024

ఉపాధి హామీ పోస్ట్ కార్డు ఉద్య‌మానికి కేటీఆర్ మ‌ద్ద‌తు

ఉపాది హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసందానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డుల ఉద్య‌మానికి నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఉత్తరం రాసి త‌న‌ మద్దతును తెలిపారు.

రైతులకు మేలు చేసే మంచి కార్యక్రమమ‌ని, ఉత్తర యుద్దాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మానికి మద్దతు తెలుపుతూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు, నాయకులు కేంద్రానికి ఉత్తరం రాస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement