Sunday, May 5, 2024

ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో నిర్వాహకుల నుంచి కెటిఆర్​కు ఆహ్వానం..

హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్య‌క్ర‌మం నుంచి ఆహ్వానం అందింది. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. జూన్ 7, 8వ తేదీల్లో దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. మంత్రి కేటీఆర్ సార‌థ్యంలో తెలంగాణ అద్భుతమైన పురోగతిని, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో సాధించిందని, ఇలాంటి నాయకులు తమ సమావేశంలో పాల్గొనడం వలన సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement