Sunday, May 19, 2024

ఇందూరులో ఐటి ట‌వ‌ర్ తో పాటు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు. కొత్తగా రిక్రూట్‌ అయిన ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. రూ.50 కోట్లతో మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు. కాగా , న్యాక్ భవనం, దుబ్బా వైకుంఠధామము, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.

అంత‌కు ముందు నిజాంబాద్ జిల్లాకు విచ్చేసిన మంత్రి కేటీఆర్ కు నగరంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో ఎలిఫ్యాడ్ వద్ద అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల,ఎన్ ఆర్ ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల లు పుష్పగు చ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, షకీల్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement