Sunday, April 28, 2024

TS: కేటీఆర్‌కు తీవ్ర‌జ్వ‌రం… కేసీఆర్ సభకు దూరం…

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర జ్వ‌రం, ప్లూతో బాధ‌ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. గ‌త రెండు రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతూ డాక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇంటి వ‌ద్ద‌నే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ క‌రీంన‌గ‌ర్‌లో నిర్వ‌హించే క‌ధ‌న‌భేరికి హాజ‌రు కాలేన‌ని కేటీఆర్ తెలిపారు.

కరీంనగర్ సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. త‌న కార్యాల‌యం ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నట్లు చెప్పారు. అయితే మూడు రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో అస్వస్థతకు గుర‌య్యారు. ఇంకా కేటీఆర్ ఆరోగ్యం కుదుటప‌డ‌లేద‌ని, ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అవుతుందని ఆయన డాక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement