Monday, April 29, 2024

AP: గీతాంజలి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి.. మంత్రి రోజా

ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తవ జీవితాన్ని చాలించిందని, గీతాంజ‌లి మృతికి కార‌ణ‌మైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ఏపీ మంత్రి రోజా అన్నారు. ఇవాళ ఆమె తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… గీతాంజలి మరణం బాధాకరమన్నారు.

గీతాంజలి మృతి కారకులైన వారిని కఠఛినంగా శిక్షించాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్దించినట్టు చెప్పారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా చూపించడమే గీతాంజలి చేసిన తప్పు పనా అని ప్రశ్నించారు. మహిళల‌ను చులకనగా చూసే జనసేన, టీడీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని రోజా అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement