Monday, May 6, 2024

TS : ఇవాళ కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ

కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రీ మెంబర్ కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇవాళ జలసౌధలో తెలంగాణ, ఏపీ అధికారులతో సమావేశం కానుంది.

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రాష్ట్రాల అవసరాలు, వాటర్ అకౌంట్ తదితర విషయాలపై సమావేశంలో చర్చించనున్నారు.అయితే, మార్చి నెలాఖరు దాకా రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటిపై వాటర్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని కేఆర్ఎంబీ మెంబర్ను ఆదేశించింది.

- Advertisement -

ఈ మేరకు మీటింగ్ నోటీసులను తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు, కేఆర్ఎంబీ చైర్మన్ పీఎస్, మెంబర్లకు పంపించింది. కాగా, రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో పలుచోట్ల తాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాలు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement