Thursday, May 9, 2024

89వ రోజు కి చేరిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రగతి యాత్ర’

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్-ఏ, బిలలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా 89వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. పర్యటనలో పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా మంచినీటి సమస్య, మిగిలిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు కేబుల్ మార్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిజిఎం అప్పల నాయుడు, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, అంజన్ గౌడ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, కమలాకర్, ఇబ్రహీం, మూసాఖాన్, సింగారం మల్లేష్, చిన్నా చౌదరి, ఇమ్రాన్ బైగ్, బస్తీ ప్రెసిడెంట్ జునైద్, అహ్మెద్ అలీ, కృష్ణ, బద్రి, సంతోష్, బషీర్, అమీర్, షఫీక్ అలీ, తాజ్, షబానా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement