Sunday, April 28, 2024

బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి.. ఈటెల రాజేందర్

బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, ప్రజావ్యతిరేక చర్యలు ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని అధికారంలోకి తెచ్చేవిధంగా పనిచేయాలని రాష్ట్ర బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటెల రాజేంద్ర ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ని నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పి, సత్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెలంగాణ ఉద్యమ ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ కి బాధ్యత ఇవ్వడం సంతోషకరమన్నారు.


ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్, జిల్లా అధ్యక్షులు విక్రం రెడ్డి, రాష్ట్ర మైనార్టీ మోర్చా మహిల ప్రముఖ ఆమల్లేశ్వరి, ఎస్సీ మోర్చా జాయింట్ కన్వీనర్ నాగరాజు, జిల్లా ఇంటలిచివల్ ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రమౌళి, జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యులు కాశి, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు గొల్ల కృష్ణ, నరేంద్ర, బిక్షపతి యాదవ్, కార్యదర్శులు శేషారావు, అధికార ప్రతినిధి కౌశిక్ నాయుడు, సోషల్ మీడియా కన్వీనర్లు సురేష్, ఉదయ్, కార్యవర్గ సభ్యులు విజయ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కవితా రెడ్డి, ఎస్టి మోర్చా అధ్యక్షులు అశోక్ నాయక్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కుంకి రాము, కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రసాద్ రాజు, ఉపాధ్యక్షులు మాధవరావు, బీజేవైఎం అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, ట్రేడర్ సెల్ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి, హనుమయ్య, సతీష్, లక్ష్మయ్య, రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement