Thursday, May 2, 2024

లోతట్టు ప్రాంతాల‌లో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

కుత్బుల్లాపూర్ – గంత కొన్ని రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జిడిమెట్ల డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, మీనాక్షి ఎస్టేట్ లలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వరద నీరు నిలవకుండా చూడాలని, SNDP ద్వారా చేపడుతున్న నాలా పనులను త్వరతగిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు, రాబోయే రోజుల్లో ఈ కాలువ నిర్మాణం ద్వారా వరద ముంపుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని తెలిపారు.. అదేవిదంగా చుట్టుపక్కల కాలనీ లలో ముంపుకు గురిఅవుతున్న వరదనీటి మళ్లించడానికి రూ. 2.40 కోట్లతో త్వరలోనే కాలువ నిర్మాణానికి కూడా చేపట్టబోతున్నాం అని కాలనీ వాసులకు తెలియచేసారు..

అలాగే నియోజకవర్గంలో రానున్న రోజులలో వరదనీటి ముంపుకు గురి కాకుండా ఒక ప్రణాళిక బద్దంగా చెర్యలు చేపట్టి వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. చెన్నరెడ్డి, ఈ.ఈ. కృష్ణ చైతన్య, డి.ఈ.ఈ. పాపమ్మ ఏ.ఈ. లు సురేందర్ నాయక్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement