Tuesday, April 30, 2024

మంత్రి పువ్వాడకు భద్రాద్రి కొతగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు అనుదీప్, గౌతంల శుభాకాంక్షలు

హైదరాబాద్/ఖమ్మం – . డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం రవాణా శాఖకు ఐదవ అంతస్తులో ఛాంబర్ కేటాయించారు..ఈ ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పువ్వాడ అజయ్ కుమార్ తనకు కేటాయించిన సీట్లో ఆసీనులయ్యారు..ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ కు భద్రాద్రి కొతగూడెం, ఖమ్మం జిల్లా కలెక్టర్లు కలెక్టర్ అనుదీప్, విపి గౌతం పుష్ప గుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర ఘట్టంలో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా నిర్మించారని మంత్రి పువ్వాడ అభివర్ణించారు. ఈ మహాఅద్భుత ఘట్టం నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మంత్రి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement