Sunday, April 28, 2024

యంగ్ హీరోలకు గ‌ట్టి పోటీ ఇస్తున్న బాలయ్య‌.. సినిమాల‌న్నిటినీ లైన్‌లో పెట్టేశాడు

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమాతో మంచి బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌ విజయాన్ని అందుకున్నారు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో NBK108 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక‌.. “పైసా వసూల్” సినిమా త‌ర్వాత‌ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో NBK110 సినిమాను చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంది. కాగా, ఈ సినిమా బోయపాటి NBK109 సినిమా త‌ర్వాతే రానున్న‌ట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వ‌స్తున్న‌ NBK110 సినిమాకు అప్పుడే టైటిల్ ఖరారు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు “కాకా” అనే పేరును ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించిన ముచ్చ‌ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక.. NBK108 విషయానికి వస్తే.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూట్‌లో కాజల్ కూడా పాల్గొంటోంది. థమన్ సంగీతం అందిస్తోండ‌గా.. దసరా సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

అయితే.. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ లో కుర్ర హీరోలకు గట్టి పోటీనే ఇస్తున్నారు బాలయ్య.. యంగ్ హీరోల‌తో సమానంగా ఇంకా చెప్పాలంటే వారికంటే చురుగ్గా.. సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఓ ఐదు సినిమాలను లైన్‌లో పెట్టారు. అంతే కాకుండా ఈ ఐదు సినిమాలకు దర్శకులు.. నిర్మాతలు ఫైనల్ అయ్యారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మరికొన్ని స్క్రిప్ట్ పనుల్లో బిజిగా ఉన్నాయి.

- Advertisement -

ఇక ఆ ఐదు సినిమాల విషయానికి వస్తే..

NBK108 – అనిల్ రావిపూడి దర్శకుడు, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మాణం కానుంది.
NBK109 – బోయపాటి శ్రీను దర్శకుడు, 14 రీల్స్ ప్లస్ నిర్మాణం,
NBK110 – పూరి జగన్నాథ్ దర్శకుడు, పూరి కనెక్ట్ బ్యానర్‌లో ఛార్మి నిర్మాత.
NBK111 – బాబీ దర్శుకుడు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించనున్నారు.
NBK112 – పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్’పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు.
NBK108 – అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం.

అయితే.. ఈ సినిమాకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతుండ‌గా.. ఆరు భాషల్లో విడుదల కానుందని సమాచారం. వీరసింహా రెడ్డి హిట్ తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తుండడంతో ఈ సినిమాపూ కూడా భారీగా అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు దాదాపుగా రాయలసీమ నేపథ్యంలోనే సాగేవి. అయితే ఈ సినిమా మాత్రం తెలంగాణ నేపథ్యంలో రానుందని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. అయితే ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తైందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement