Saturday, April 27, 2024

బండి సంజ‌య్ పై దాడిని ఖండించిన కూన శ్రీశైలం గౌడ్

రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా వరి కొనుగోలు కేంద్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన దాడిని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తీవ్రంగా ఖండిచారు. భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం పర్యటించిన సందర్భాలు ఉన్నాయని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. సమస్యలను పరిష్కరించడం ఇష్టంలేని టిఆర్ఎస్ పార్టీ దాడులకు పాల్పడడం చాలా దురదృష్టకరమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement