Monday, May 6, 2024

మ‌ద్యం మ‌త్తులో త‌మ్ముడిని హ‌త్య చేసిన అన్న‌


మ‌ద్యం మ‌త్తులో త‌మ్ముడిని అన్న చంపిన ఘ‌ట‌న‌ మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దంతాలపల్లి మండలంలో ఈ దారుణం జరిగింది. మండలంలోని రేపోనిలో మద్యం మత్తులో తమ్ముడిని అన్న పొట్టనపెట్టుకున్నాడు. రేపోనికి చెందిన వెంకన్న, గంగయ్యలు అన్నదమ్ములు. గురువారం రాత్రి ఇద్దరు కలిసి మందు తాగారు. అయితే ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం పెద్దదిగా మారింది. దీంతో మద్యంమత్తులో ఉన్న వెంకన్న ఆవేశంతో చేతికందిన గొడ్డలితో గంగయ్యని నరికాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement