Saturday, April 27, 2024

HYD : పాత‌బ‌స్తీలో దారుణం…వ్యక్తి దారుణ హత్య

హైద‌రాబాద్‌-పాతబస్తీలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ వ్య‌క్తిని హ‌త్య చేసి పెట్రోల్ పోసి త‌గులాబెట్టారు. హైదరాబాద్ కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ (35) అనే వ్యక్తిని జియగుడాకు చెందిన గోపి గ్యాంగ్‌ పాత క్షకల కారణంగా దారుణ హత్యకు పాల్పడింది.

హత్య చేసి బెడ్ షీట్ లో చుట్టి డస్ట్ బిన్ వద్ద మృతదేహాన్ని తగలబెట్టారు. నిన్న రాత్రి అనిల్ ను హత్య చేసిన గోపి…ఈ రోజు తెల్లవారు జామున జియగుడా సోన టిఫిన్ సెంటర్ ఎదురు వీధిలో డస్ట్ బిన్ వద్ద పెట్రోల్ పోసి నిప్పు తగలబెట్టాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు గోపి ఉన్నాడు. అనిల్ హత్య చేసిన అనంతరం జీయగుడాలో నిన్న అర్థరాత్రి నరికిన చేతితో గోపి తిరిగాడని గుర్తించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న కులుసుంపుర పోలీసులు క్లూస్ టీమ్..దర్యాప్తు చేస్తున్నాయి. అటు అనిల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement