Monday, April 29, 2024

Suicide: క‌రీంన‌గ‌ర్‌లో విషాధం…డిగ్రీ విద్యార్థినీ ఆత్మ‌హ‌త్య‌

క‌రీంనగర్‌లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. హాస్ట‌ల్ గ‌దిలో ఉరేసుకొని విద్యార్థినీ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. నగునూరులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో డిగ్రీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 19 ఏళ్ల సృజన హాస్టల్లో ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది.

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సృజన బుధవారం రాత్రి హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం హాస్టల్ సిబ్బంది చూసి పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, మానకొండూర్ మండలం గంగిపల్లికి చెందిన సృజన స్వగ్రామంలో విషాదం అలుముకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement