Friday, April 26, 2024

Breaking: యువ‌కుడిని క‌త్తుల‌తో న‌రికిచంపిన దుండుగులు.. భ‌ద్రాద్రి జిల్లాలో ఘ‌ట‌న‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోరం జ‌రిగింది. ఓ యువకుడిని కత్తులతో నరికిచంపిన ఘంట‌న ఇవ్వాల చోటుచేసుకుంది. రామవరం సీఆర్‌పీఎఫ్​ క్యాంపులో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి కత్తులతో పొడిచి చంపిన ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం, సీఆర్ పీ క్యాంపులో ఆదివారం రాత్రి వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. రాహుల్ (30)ను జంజర్ల జానకిరామ్ మారణాయుధంతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మరణించారు.

పాత కక్షల కారణంగానే హత్య చేసినట్టు తెలుస్తుంది. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. సంఘటన స్థలానికి కొత్తగూడెం డిఎస్పి జి.వెంకటేశ్వర బాబు, టూ టౌన్ సీఐ రాజు చేరుకొని సంఘటన స్తలాన్ని పరిశీలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement