Friday, May 3, 2024

వరదల్లో చిక్కుకున్న విద్యార్థులు.. తాడు సహయంతో కాపాడిన అధికారులు

మణుగూరు, (ప్రభ న్యూస్) : మణుగూరు మండలంలోని గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగ అశోక్ నగర్ ప్రాంతంలో ఎస్సీ బాలుర వసతిగృహం వరద నీటితో నిండిపోయింది. హాస్టల్ లో ఉన్న 40 మంది విద్యార్థులు హాస్టల్ పైన తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కొత్తగూడెం ఓఎస్డి సాయి మనోహర్, మణుగూరు సీఐ ముత్యం రమేష్, తాసిల్దార్ నాగరాజు తదితరులు అక్కడికి చేరుకున్నారు. లోపలికి పోవడానికి వీలు లేకుండా వరద నీరు చేరడంతో,లోనికి వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాకచక్యంగా వ్యవహరించిన అధికార గణం వెంటనే స్పందించిన తాడు సహాయంతో హాస్టల్లోకి చేరుకొని హాస్టల్లో చిక్కుకున్న 40 మంది విద్యార్థులను తాడి సహాయంతో బయటకు తీసుకువచ్చారు. విద్యార్థులు బయట పడటంతో ఎలాంటి నష్టం జరగకపోవడంతో, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement