Saturday, May 4, 2024

క్రీడాకారుల‌ని అన్ని విధాల ప్రోత్స‌హిస్తాం.. జిల్లా పరిషత్ చైర్మన్

చింతకాని ( ఖమ్మం) : జిల్లాలోని చింతకాని మండలం కోదుమూరు గ్రామంలో సీఎం కప్ టోర్నమెంట్ ను ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు. యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అందుకు తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని సూచించారు. క్రీడా రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని అందులో భాగంగా క్రీడాకారులను అన్ని విధాల ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగాణాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యువత సీఎం కప్ టోర్నమెంట్ ను సద్వినియోగం చేసుకొని తమలో ఉన్న ప్రతిభను కనబరచాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement