Friday, April 26, 2024

పోలీస్ వాహ‌నం బోల్తా – ఎస్ ఐకి త‌ప్పిన ముప్పు…

ఖమ్మం : తిరుమలాయపాలెం ఎస్‌ఐ రఘకు త్రటిలో ప్రమాదం తప్పింది. తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపుకు వెళ్లుతుండగా ఎస్‌ఐ వాహనానికి ఎదురుగా వచ్చిన ఐస్ క్రీం బండిని తప్పించబోయి పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ క్రమంలో లో రెండు పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో డ్రైవర్‌తో పాటు ఎస్‌ఐ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎస్‌ఐకు స్పల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వేరే వాహనం తెప్పించుకోని తిరుమలాయపాలెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం ఎస్‌ఐ తిరిగి మళ్లీ విధుల్లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement