Thursday, April 18, 2024

జానారెడ్డి గెలిచినా ఒరిగేదేముంది: తలసాని

నాగార్జున సాగర్ ఎపఎన్నికల్లో జానారెడ్డి గెలిచిన ఉపయోగం ఉండదదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సాగర్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ పోటీ చేస్తున్న విషయం తెలిసింది. ప్రచారంలో వేగం పెంచాడు టీఆర్ఎస్ నాయకుడు నోముల భగత్. భగత్ కు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రచారం చేశారు. మంత్రి తలసాని జానారెడ్డిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఓటేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, గతంలో అధికారంలో ఉన్నప్పుడే జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఇప్పుడు జానారెడ్డి గెలిచినా ఏంచేస్తారని విమర్శించారు. విద్యావంతుడైన నోముల భగత్ కు ఓటేయాలని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే భగత్ ను ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement