Tuesday, April 30, 2024

ఖమ్మం నగర కేంద్ర గ్రంథాలయం చైర్మ‌న్ గా మహమ్మద్ ఆశ్రిఫ్..

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నగర కేంద్ర గ్రంథాలయం చైర్మ‌న్ గా మహమ్మద్ ఆశ్రిఫ్ ను నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్రవారం ఉత్త‌ర్వులు జారీచేసింది. అదేవిధంగా కంచర్ల దయాకర్, గొల్లపూడి రామ్ ప్రసాద్, మేకల సుగుణరావు, రంగరాజు ఊర్మిళను ప్ర‌భుత్వం స‌భ్యులుగా నియ‌మించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. నూతన గ్రంథాలయం కమిటీ ఏర్పడిన సందర్భంగా వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేసి యువత బంగారు భవితకు తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement