Friday, May 3, 2024

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు

కామేపల్లి: రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం ఉదయం పండితాపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డోర్నకల్‌ మండలం గొల్లచెర్ల గ్రామానికి చెందిన చాంపల, శ్రీరామ్‌ అనే ఇద్దరు వ్యక్తులు గొర్రెలను తీసుకుని పండితాపురం సంతకు ఆటోలో వెళ్తున్నారు. ఇదే సమయంలో ఖమ్మం పట్టణానికి చెందిన అశోక్‌, అజయ్‌ ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుంచి డోర్నకల్‌కు వెళ్తున్నారు. పండితాపురం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు వాహనాలు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అశోక్‌, అజయ్‌, ఆటోలో ప్రయాణిస్తున్న చాంపల, శ్రీరామ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement