Saturday, April 20, 2024

17వ రోజుకు రైతుల మహా పాదయాత్ర

అమరావతి రైతులు చేపట్టిన మహాపాద యాత్ర 17వ రోజు ఏలూరు సమీపంలోని కొత్తూరు నుంచి ప్రారంభమైంది. నిన్న యాత్రకు విరామం ఇచ్చిన రైతులు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఏలూరు నుంచి కొవ్వలి వరకు 14 కి.మీ మేర సాగనుంది. పాదయాత్రకు బాపట్ల జిల్లా చందలూరు రైతులు, మహిళలు, టీడీపీ, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి మాట్లాడుతూ.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు పాదయాత్ర లో పాల్గొంటున్న మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం శోచనీయమని పేర్కొన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఎన్ని నిర్భందాలు పెట్టినా యాత్ర ప్రజల మద్ధతుతో దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు. అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement