Thursday, May 2, 2024

KHM: బీఅర్ఎస్ గూటికి మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ దంపతులు

ఇల్లందు : ఇల్లందు మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ మడత రమా వెంకట్ గౌడ్ లు బీఅర్ఎస్ లో చేరనున్నారు. ఎన్నికల వేళ అధికార బీఅర్ఎస్ కు వీరి చేరిక కొండంత బలాన్ని చేకూర్చనుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదని స్వతంత్రంగా బరిలోకి దిగి నాటి బీఆర్ ఎస్ ను పరుగులు పెట్టించారు.

పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని మడతను సస్పెండ్ చేశారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్న మడత దంపతులు ఇటీవల కాలంలో తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు రాష్ట్రాన్ని, నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసే వైపు వెళ్లాలని ప్రజల అభిప్రాయం మేరకు బీఅర్ఎస్ కు దగ్గరయ్యారు. వీరి చేరిక అధికార పార్టీకి కొండంత లాభం చేకూరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement