Wednesday, May 1, 2024

KHM: షోయింగ్ కోసం పార్టీ మారిన వారిని ఓడించండి.. హరిప్రియ నాయక్

ఇల్లందు : షోయింగ్ కోసం పార్టీ మారిన వారిని ఓడించాలని పరోక్షంగా కోరం, డీవీలను బీఅర్ఎస్ అభ్యర్ధి హరిప్రియ నాయక్ విమర్శించారు. ఎన్నికల సమయంలో పార్టీ మారితే వారిని ఏమని అనాలని ప్రజల ద్వారా సమాధానం ఇప్పించారు. ఇల్లందు అభివృద్ధి కోసం నిలపడ్డ తాను కావాలో, ఎందుకు పార్టీ మారారో తెలియని అయోమయంలో వున్న కోరం కావాలో తెలుసుకోవాలన్నారు.

రూ.300 వందల కోట్ల నిధులు తెచ్చి ఇల్లందు అభివృద్ధి చేశామన్నారు. మడత వెంకట్ గౌడ్ 20 వేల మెజార్టీ తీసుకొచ్చి గెలిపిస్తానని తనకు హామీ ఇచ్చారని అన్నారు. ప్రతి కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో మడత వెంకట్ గౌడ్, దిండిగాల రాజేందర్, ఎస్ కే జానీ, శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement