Tuesday, May 14, 2024

KHM: కాంగ్రెస్, బీఅర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ..

ఇల్లందు…. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై అసమ్మతి వార్డు కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఈరోజు జరుగుతుండడంతో ఇన్ని రోజులు క్యాంపులో ఉన్న వార్డ్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న నేపథ్యంలో ముగ్గురు వార్డు కౌన్సిలర్లను అధికార పార్టీకి చెందిన నాయకులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘర్షణకు దిగారు.

ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చెరొక వైపు నిలబడి అవిశ్వాసంలో నెగ్గాలని ఒకరు, వీగిపోవాలని ఒకరు తమ అనువర్గాలతో పాచికలు వేశారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ నాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయంకు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement