Saturday, May 4, 2024

శాంతిస్తున్న గోదారి.. తగ్గుతున్న నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం త‌గ్గుతుంది. దీంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. ఎగువన భారీ వర్షాలతో వదర పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి 53 అడుగులు దాటింది. అయితే ఎగువనుంచి వరద నిలిచిపోవడంతో ప్రవాహం తగ్గుతున్నది. గురువారం ఉదయం 6 గంటలకు 47.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement