Saturday, May 4, 2024

తెలంగాణ హరితహారం దేశానికే ఆదర్శం – జడ్పీ ఛైర్మ‌న్ లింగాల కమల్ రాజు

ఖమ్మం : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణా హరితోత్సవం కార్య‌క్ర‌మంలో భాగంగా మధిర మండలం లక్ష్మీపురం గ్రామంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ హాజరై మొక్కలు నాటారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా ఏర్పడిన తరువాత మొక్కలు నాటే హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మొక్కలు నాటించి వాటిని సంరక్షించే కార్యక్రమం చేపట్టిన గొప్ప మహనీయుడు కేసీఆర్ అన్నారు .

హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో విరివిగా వర్షాలు కురుస్తున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement