Monday, May 20, 2024

TS: ఖమ్మంలో.. మంత్రి పువ్వాడ నామినేషన్..!

ఖమ్మం బ్యూరో : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఇవాళ ఖమ్మంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారిగా ఉన్న కమిషనర్ ఆదర్శ సురభికి నామినేషన్ పత్రాలు అందించారు. అంతకు ముందు మంత్రి పువ్వాడ దంపతులు ఖమ్మం వీడీఓస్ కాలనిలోని శ్రీ షిరిడి సాయి బాబా దేవాలయం, ఎన్ఎస్పీ క్యాంపులోని శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి దేవాలయం, ఎన్ఎస్ టీ రోడ్ లోని స్తంబాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, త్రీటౌన్ లోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయం, తుమ్మలగడ్డలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

నామినేషన్ పత్రాలు దాఖలు సందర్భంగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఆర్ జేసీ కృష్ణ, కె.వి రత్నం, జహీర్ అలీ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, వైశ్య ప్రముఖులు, భద్రాద్రి బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, బానోత్ చంద్రావతి, పారా నాగేశ్వరరావు, ఎండీ ఖమర్, పలు సామాజిక వర్గాల ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement