Tuesday, May 7, 2024

PURI : జ‌గ‌న్నాథుడి ఆల‌యంలో తొక్కిసలాట.. 10 మందికి గాయాలు

ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట జ‌రిగింది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలో గత పౌర్ణమి నుంచి కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో కార్తీక మాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని ఇవాళ‌ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ సందర్శనకు వెళ్లారు.

ఈ క్రమంలో ఉదయం ఆలయంలో ‘మంగళ ఆలతి’ నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీంతో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలోకి నెట్టుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ పూరీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement