Wednesday, May 22, 2024

Khammam – ఎం పీ నామ నివాసంలో బీఆర్ఎస్ నేతల భేటీ

ఖమ్మం నగరం, : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగించుకొని ఢిల్లీ నుంచి ఖమ్మం చేరుకున్న బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మంగళవారం రాత్రి ఖమ్మంలోని తన స్వగృహంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు,తో కలసి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ తో ప్రత్యేకించి భేటీ అయి రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక సమాలోచనలు జరిపారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని సీట్లు గెల్చుకునేందుకు అంతా పట్టుదల, దృఢదీక్ష తో పని చేయాలని ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు వారికి దిశా నిర్దేశం చేశారు. సునాయాసంగా వైరా సీటును కైవశం చేసుకునేందుకు సమైక్యంగా, చైతన్యవంతమైన భూమిక వహించాలని, అందరూ అన్నదమ్ముల్లా పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రమించాలని ఈ సందర్భంగా ఎంపీ నామ వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ను, పార్టీ నేత, అభ్యర్థి మదన్ లాల్ ను కోరినట్లు సమాచారం.

. ప్రతి బూత్ లో అత్యధిక మెజార్టీ సాధించాలని విశ్లేషించారు. అందులో భాగంగా నేతల సమన్వయ , సమైక్యత కోసం నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు వారీగా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం..మండలాల సమావేశాల్లో గ్రామాల వారీగా పూర్తిగా విశ్లేషించి మాట్లాడుకోవాలని నామ ఆదేశించారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు నేతలను కోరినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement