హైదరాబాద్ – సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం కెసిఆర్ ఆయా శాఖల అధికారులతో కొత్త సచివాలయంలోని తన ఛాంబర్ లో కూలంకంషంగా చర్చించారు. ఇందులో భాగంగా జులై వరకు కరివెన జలాశయంకు నీళ్లు తరలించాలని, ఆగస్ట్ వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని.. పంప్హౌస్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్లోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై సమీక్షించారు. మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం సూచించారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ పై కెసిఆర్ సమీక్ష…పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశం..
Advertisement
తాజా వార్తలు
Advertisement