Monday, May 27, 2024

TS: కాసేప‌ట్లో పార్టీ నేత‌ల‌తో కేసీఆర్ భేటీ..

కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ నేత‌ల‌తో భేటీ కానున్నారు. పార్టీ మేనిఫెస్టో ప్రకటన.. బీఫామ్ ల అందజేత నేపథ్యంలో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజక వర్గ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులు.. ఇప్పటికే దాదాపు నేతలంతా తెలంగాణ భ‌వ‌న్ కు చేరుకున్నారు.

పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి, అభ్యర్థులకు బీఫామ్ లు అందజేయనున్నారు. ఆపై ఎన్నికల ప్రచారంపై పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఆపై సాయంత్రం హుస్నాబాద్ లో జరగనున్న సభలో కేసీఆర్ పాల్గొంటారు. హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement