Tuesday, May 7, 2024

Khammam : ఖమ్మంలో బీఆర్ఎస్‌కు షాక్..!

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ కాంగ్రెస్ పార్టీలో చేతురున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు బాలసాని ఇంటికి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లనున్నారు. దీంతో పార్టీ మారే ఆలోచనలో బాలసాని ఉన్నట్లు తెలియవచ్చింది. భద్రాచలం బీఆర్ఎస్ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌కు సీఎం కేసీఆర్ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

గతంలోనూ స్థానిక సంస్థల సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు బాలసానికి ఇవ్వకుండా తాతా మధుసూదన్‌కు పార్టీ అదిష్ఠానం అవకాశం ఇచ్చింది. దీంతో గత కొద్ది రోజులుగా బాలసాని బీఆర్ఎస్‌పై అలక వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చేరాలని కోరేందుకు మరి కొద్దిసేపట్లో బాలసాని ఇంటికి పోంగులేటి, తుమ్మల వెళ్లనున్నారు. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బాలసానితో చర్చలు జరిపారు. బీఆర్ఎస్‌లో ఉండాలని సూచించారు. అలాగే బాలసానిని మంత్రి కేటీఆర్‌తో రవిచంద్ర మాట్లాడించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement