Monday, May 6, 2024

మరికొద్దిసేపట్లో కెసిఆర్ మహరాష్ట్ర పయనం – టూర్ వివరాలు

హైదరాబాద్ – బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. నేడు ఉదయం 10:30కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 11 గంటల 15 నిమిషాలుకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.అక్కడ నుంచి సాంగ్లీ జిల్లా వాటేగావ్‌ తాలూకా కేంద్రంలో దళిత నేత అన్నా భావ్‌ సాఠే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. 12.45 నిమిషాలకు అన్నబాయ్ సాటే విగ్రహానికి కేసీఆర్ నివాళ్లు అర్పించనున్నారు.

మధ్యాహ్నం 1 గంటలకు అన్నాభావ్ సాఠే కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి.. 1.30 నిమిషాలకు ఇస్లాంపూర్ లోని రఘునాధ్ దాదా పాటిల్ ఇంట్లో భోజనం చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ సాంగ్లీ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రముఖలతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.

కొల్హాపూర్‌లోని దేవీ అంబాబాయి దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకొంటారు. సాయంత్రం 5 గంటలకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు ఆయన తిరుగు పయనం అవుతారు

Advertisement

తాజా వార్తలు

Advertisement