Monday, April 29, 2024

TS: కవిత అరెస్ట్ పై కేసీఆర్, మోడీ మౌనం దేనికి సంకేతం?.. రేవంత్ రెడ్డి

క‌విత అరెస్ట్ పై కేసీఆర్ న‌రేంద్ర మోడీ మౌనం దేనికి సంకేత‌మ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక రోజు ముందు కవిత అరెస్ట్ జరగడం తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందన్నారు. కవిత అరెస్ట్ చేయడం ద్వారా ఆ క్రెడిట్ ను బీజేపీ, అరెస్ట్ ద్వారా బీఆర్ఎస్ సానుభూతిని పొందే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కవితను అరెస్ట్ చేస్తే తండ్రిగా కాకపోయినా పార్టీ అధ్యక్షుడిగా అయినా కేసీఆర్ స్పందించలేదన్నారు.

కవిత అరెస్ట్ పై కేసీఆర్, నరేంద్ర మోడీ మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలవబోతున్నదని అన్ని సర్వేలు చెబుతున్నాయని అందువల్ల కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే బీఆర్ఎస్, బీజేపీ ఈ చీఫ్ పొలిటికల్ డ్రామాకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఇకనైనా మోడీ, కేసీఆర్ ఈ డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోడీ వచ్చేవారని కానీ నిన్న మాత్రం మోడీ, ఈడీ కలిసే వచ్చారని సెటైర్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement