Friday, May 3, 2024

AP: అన్న చేతిలో తమ్ముడు దారుణహత్య..

సోంపేట, మార్చి 16 (ప్రభ న్యూస్) : శ్రీకాకుళం జిల్లా మందస మండలం సొండిపూడిలో అన్న చేతిలో తమ్ముడు దారుణహత్య కు గురయ్యారు. ఈఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. సొండిపూడిలోని బీసీ కాలనీకి చెందిన లైశెట్టి కూర్మారావు, నీలాద్రి అనే అన్నదమ్ములు తరచూ గొడవలు పడుతుండేవారని పోలీసులు తెలిపారు. తల్లి నిర్మిస్తున్న ఇంట్లో తనకు వాటా ఉందంటూ నీలాద్రి గతరాత్రి అన్న, తల్లితో గొడవపడ్డాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ‌ కొట్లాటకు దారి తీసింది.



అన్న కూర్మారావు తన తమ్ముడు నీలాద్రిపై కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆపై బండరాయితో తమ్ముడు నీలాద్రి తలపై కొట్టి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు‌. తల్లి రోధించడంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న మందస పోలీసులు, కాశీబుగ్గ రూరల్ సీఐ ఈశ్వరరావు, వజ్రపుకొత్తూరు ఎస్సై రామారావులు
ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం కోసం హరిపురం సామాజిక ఆస్పత్రిలోని మార్చురీ రూమ్ కు తరలించారు. శనివారం ఉదయం సొండిపూడి చేరుకున్న పోలీసులు పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలో ఓ ఇటుక బట్టి దగ్గర దాక్కున్న కూర్మారావును అదుపులోకి తీసుకున్న మందస పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మృతుని తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదుతో నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ రూరల్ సిఐ ఈశ్వరరావు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement