Monday, May 6, 2024

కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం..

శివ్వంపేట, (ప్రభన్యూస్‌): శివ్వంపేట పెద్దచెరువు కట్టపై నిర్మించిన నూతన కట్ట మైసమ్మ దేవాలయంలో ఈనెల 28, 29 తేదీలలో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం వేద పండితులు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ, వామనశర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని శివ్వంపేట సర్పంచ్‌ పత్రాల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మండల ప్రజలంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శివ్వంపేట వార్డు సభ్యులు వంజరి కొండల్‌, బాసంపల్లి పోచగౌడ్‌, అశోక్‌గౌడ్‌, వెంకటస్వామి, లింగం యాదవ్‌, పైనం యాదగిరి, దొడ్లే అశోక్‌, గౌడిగూడెం నాగరాజు, ఇసుగారి అరుణ్‌, రవినాయక్‌, గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement