Sunday, April 28, 2024

వర్క్ ఫర్ హోం ఇవ్వండి..

పెద్దపల్లిరూరల్‌: ప్రభుత్వ పాఠశాలలను తక్షణమే మూసివేసి ఉపాధ్యాయులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోరెడ్డి దామోదర్‌రెడ్డి, అర్కాల శ్రీనివాస్‌లు డిమాండ్‌ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పాఠశాలలకు లాక్‌డౌన్‌ విధించినా ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు హాజరై విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారిందని వాపోయారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకపోకలు సాగించే సమయంలో కరోనా సోకే ప్రమాదం ఉందని, ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి వర్క్‌ఫర్‌ హోం విధానాన్ని ఉపాధ్యాయులకు ప్రవేశపెట్టాలని కోరారు. పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement