Tuesday, May 7, 2024

బీఆర్ఎస్ తోనే సంక్షేమం.. ఎమ్మెల్యే దాసరి

భారత రాష్ట్ర సమితితోనే సంక్షేమమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల అశోక్ గులాబీ గూటిలో చేరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ దండులో చేరుతున్నారన్నారు.

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసి, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. గత 40 ఏళ్లలో జరగని అభివృద్ధి పెద్దపల్లి నియోజకవర్గంలో చేసి చూపామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సతీష్, సబ్బితం సర్పంచ్ సది, మాదాసు శ్రీనివాస్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement