Thursday, May 16, 2024

వ్యాక్సిన్‌ తప్పనిసరి..

పెద్దపల్లి : 45 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలని రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఫణీంద్ర పేర్కొన్నారు. మండలంలోని తుర్కల మద్దికుంట గ్రామ జిల్లా పరిషత్‌ పాఠశాలలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ వేయించుకునే వారు ఆధార్‌ కార్డు వెంట తీసుకొచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తంగేళ్ల జయప్రద సంజీవ రెడ్డి, వైస్‌ ఎంపిపి ముత్యాల రాజయ్య, వైద్య సిబ్బంది జగన్‌, స్టాఫ్‌నర్స్‌, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement