Sunday, April 28, 2024

క‌లుషిత ఆహారం తిని ఇద్ద‌రు బాలురు మృతి.. మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మం..

పెద్ద‌ప‌ల్లి – అంతర్గాం మండలంలో కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. జిల్లాలోని ఈసంపేటకు చెందిన గుణవతి, శ్రీశైలం భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు. . శ్రీశైలం తల్లి సారమ్మ కూడా వారితోనే ఉంటున్నది. అయితే గత మంగళవారం కుటుంబ సభ్యులంతా ఆహారం తీసుకున్న వెంట‌నే వారంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీశైలం కుమారులైన శివానంద్‌ (12), శరణ్‌ (10) ఇవాళ మృతిచెందారు. కరీంనగర్‌లోనే మరో దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీశైలంతోపాటు అతని భార్య, తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement