Saturday, May 4, 2024

కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టిన టీఆర్ఎస్ మహిళలు

సోదర భావానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోనీ తెరాస పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ గృహంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కటౌట్ లకు టీఆర్ఎస్ మహిళలు రాఖీలు కట్టి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement