Saturday, May 18, 2024

సోదరుని ఇంట రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి సబితమ్మ

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి సోదరుడు నరసింహ్మ రెడ్డి ఇంటికెళ్లి రాఖీ కట్టారు. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
అక్కా-తమ్ముళ్ల, అన్న- చెల్లెళ్ళ వెల కట్టలేని ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ఈ పండుగ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రతి ఇంట సంతోషాలు వెల్లివిరిసే రక్షా బంధన్ ను కుటుంబసభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జాతీయ సమైఖ్య రక్షా బంధన్ వేడుకల్లో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement