Sunday, April 28, 2024

ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు

ఓదెల: మండలంలో తెరాస ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస రాష్ట్ర నాయకులు గుండేటి ఐలయ్యయాదవ్‌ హరిపురంలో గ్రామంలో గులాబీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్రం సాధించేందుకే తెరాస పార్టీ ఆవిర్భవించిందని, కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. అనంతరం కొలనూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడంతోపాటు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గుండేటి మధు యాదవ్‌, నాయకులు బండారి ఐలయ్య యాదవ్‌, కందుల సదాశివ్‌, సాతూరి రాజేశం, కొల్లూరు రాజేశం, గుండేటి అరవింద్‌, తోట్ల రాజ కొమురయ్య, గుండేటి అశోక్‌, తోట్ల నాగులు, మరవేని సాయిలు పాల్గొన్నారు. అలాగే గుంపుల గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చిరంజీవి, ఉపసర్పంచ్‌ గట్టు- మహేష్‌ గౌడ్‌, వార్డు సభ్యులు కోసన సదయ్య, మర్రి కుమార్‌, తాళ్ల పెళ్లి శివాజీ, మురళి, యూత్‌ అధ్యక్షుడు బొమ్మక నరేష్‌, అరుణ్‌, దేశిని రాజయ్య,రాయమల్లు, ప్రమీలలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement