Monday, April 29, 2024

దాసరి కోలుకొనివాలని పూజలు నిర్వ‌హించిన టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు

కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలోని శివాలయంలో ఆదివారం పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి కరోనాను జయించి ప్రజాక్షేత్రంలోకి ప్రజల మధ్యకు త్వరగా రావాలని టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరికి ఆ భగవంతుని కృపతో ఆయురారోగ్యాలు కలగాలని, పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో తొందరగా సంపూర్ణ ఆరోగ్యవంతులై ప్రజా సేవలోకి రావాలని టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ నరెడ్ల సదయ్య ఆధ్వర్యంలో స్వామివారి చెంత వేద పండితుడు నిట్టూరి సతీష్ శర్మ అర్చన అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శిరీష కుమార్, వార్డు సభ్యులు మార్త రమేష్ యాంసాని సురేష్, బొల్లి ప్రేమ్ కుమార్ ,ములుగురి రవి, కార్యకర్తలు గుజ్జుల మల్లేష్, సమరావు, నరసింహాచారి, బొడ్డుపల్లి శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement