Wednesday, May 1, 2024

హైగ్రీవ రిసార్ట్స్‌పై మెరుపు దాడి.. 22 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

విశాఖ జిల్లా భీమిలి మండలం ఆవనం గ్రామంలో హైగ్రీవ్ రిసోర్ట్స్ లో పేకాట డెన్‌పై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెట్ బ్యూరో(SEB) అధికారులు మెరుపు దాడి చేశారు. 22 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 5.70 లక్షల నగదు, 23 సెల్ ఫోన్లు, 9 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నగదు బదులుగా పేకాట రాయుళ్లు వినియోగిస్తున్న 321 ప్రత్యేక కాయిన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 25 లక్షలు ఉంటుందని, స్వాధీనం చేసుకున్న సొత్తును భీమిలి పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement