Thursday, April 25, 2024

గంగారాంకు ఘన నివాళి

మెట్‌పల్లి: పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌, మోచి సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు దివంగత బొర్రోల్ల గంగారంకు తెరాస పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు చైర్‌ పర్సన్‌ రానవేని సుజాత సత్యనారాయణ ఆధ్వర్యంలో గంగారాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బర్ల సాయన్న, డాక్టర్‌ రానావేణి సత్యనారాయణ, నాయకులు మార్గం గంగాధర్‌, ఎండీ జావీద్‌, కౌన్సిలర్‌ మర్రి సహదేవ్‌, ఏఎంసి వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌ గౌడ్‌, డైరెక్టర్‌ హలీం, పిప్పర రాజేష్‌, ఒజ్జల శ్రీనివాస్‌, వేముల ప్రభాకర్‌, సత్యనారాయణ గౌడ్‌, సారధి గౌడ్‌, షేక్‌ మహ్మద్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement