Wednesday, March 27, 2024

గాయపడ్డ కార్మికులకు పరామర్శ

గోదావరిఖని: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో గాయపడిన కార్మికులను వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు అంబటి నరేశ్‌ పరామర్శించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో గ్యాస్‌ లీకైన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పని స్థలాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిన ప్రమాదంలో కార్మికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందన్నారు. యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకొని గాయపడ్డ కార్మికులను ఆదుకోవాలని, నష్టపరిహాం అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట నాయకులు సురేశ్‌, నవీన్‌, కిశోర్‌, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement