Friday, May 3, 2024

పెద్దపల్లిలో దొంగల బీభ‌త్సం.. ఇళ్లలో చోరీ..

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధ‌వారం తెల్లవారు జామున దొంగలు చేకురాయి రోడ్డు, నారాయణ స్వామి నగర్ లోని పలు ఇళ్లలో చోరీకి పాల్పడి బంగారం, వెండి, నగదు అపహరించుకొని వెళ్లారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ మహేందర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఫింగర్ ప్రింట్ నిపుణులను పిలిపించి చోరీకి గురైన ఇళ్లలో వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవిలో ఊళ్ల‌కు వెళ్లే ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని విలువైన వస్తువులు ఇళ్ల‌లో ఉంచుకోరాదన్నారు. ఊళ్ల‌కి వెళ్లే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని కోరారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement